Spread the love
జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన ఎమ్మెల్సీ కవిత
తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటారు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు,MLC కల్వకుంట్ల కవిత. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు ఈ రోజు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభమ్మ, సంతోష్ కుమార్ తో కలిసి మొక్కలు నాటారు MLC కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మా అమ్మ , అన్నయ్య సంతోష్ తో కలిసి మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తు పచ్చదనం పెంచడం కోసం కృషి చేస్తు ఈ రోజు నాచేత మొక్కలు నాటించి నా పుట్టిన రోజుకు మంచి బహుమతి గా అందించావు అని. ఇది ఎప్పటికీ మరిచిపొలేని మధుర జ్ఞాపకం గా ఉంటుంది అని ఈ సందర్భంగా సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు.
Also Read This News
హైదారాబాద్ టు గోవా స్థాయిలో నగరంలో గాంబ్లింగ్ సంతోష్ దాబాపై పోలీసుల దాడితో బయటపడుతున్న నిజాలు