Spread the love
తన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద మంత్రి శ్రీ కేటీఆర్ దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆత్మ సంతృప్తినిచ్చే కార్యక్రమాల్లో భాగంగానే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రాజకీయాల్లో ఒక్కోసారి అనవసర ఖర్చు కూడా చేయాల్సి వస్తుందన్నారు. బ్యానర్లు, హోర్డింగులు పెట్టి ఖర్చు చేస్తాం. దాన్ని తగ్గించుకోవాలన్నదే తన ఆలోచన అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో వృథా ఖర్చులు పెట్టొద్దని గతేడాది తన పుట్టిన రోజు సందర్భంగా 100 అంబులెన్స్లు పంపిణీ చేసినట్లు చెప్పారు.