Spread the love
కొప్పులను ఉపముఖ్యమంత్రిని చేయాలి: మందకృష్ణ
హైదరాబాద్ జూలై 14 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ); దళిత ఎమ్మెల్యేలలో ఒకరిని మంత్రిని చేయాలని మందకృష్ణమాదిగ డిమాండ్ చేశారు. కొప్పుల ఈశ్వర్ను ఉపముఖ్యమంత్రిని చేయాలని కోరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితులను కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు. దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు ప్రభుత్వాన్ని వెంటాడుతామని హెచ్చరించారు. టీఆర్ఎస్లో ఉన్న దళిత ఎమ్మెల్యేలు నోరులేని మూగజీవాలని సీఎం కేసీఆర్పై ఫైర్ అయ్యారు.